తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. మంగళవారం తిరుమల శ్రీవారిని 2500 లోపు మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కేవలం 2,262 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 11 లక్షల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న 925 మంది భక్తులు మాత్రమే స్వామివారికి తలనీలాలు సమర్పించారు.