ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మమత కేబినెట్‌లో మాజీ క్రికెటర్‌

national |  Suryaa Desk  | Published : Tue, May 11, 2021, 12:31 PM

పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. 24 మంది కేబినెట్ మంత్రులు, 19 మంది సహాయ మంత్రులతో మొత్తం 43 మంది సభ్యుల మంత్రివర్గం ఏర్పాటైంది. సీఎం మమతా బెనర్జీతో కలిపి మంత్రివర్గంలో తొమ్మిది మంది మహిళలకు స్థానం కల్పించారు. టీఎంసీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీమిండియా మాజీ ఆటగాడు మనోజ్‌ తివారీకి క్యాబినెట్ లో చోటు దక్కింది. అతనికి క్రీడా మంత్రిత్వ శాఖను కేటాయించినట్లు తెలిసింది. కాగా భారత్‌ తరఫున తివారీ 12 వన్డేలు, 3 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com