దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా వైరస్ బారిన పడి నిన్న 3,754 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా మృతుల సంఖ్య 2,46,116కు పెరిగింది. అయితే దేశంలో నమోదవుతున్న మరణాల్లో 72.86 శాతం కేవలం 10 రాష్ట్రాల్లోనే సంభవిస్తున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హర్యానాల్లో కరోనా మరణాలు అధికంగా నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,86,71,222 మంది కోలుకున్నారు.37,45,237 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది.