కరోనా వేళ ఓ మహిళా వైద్యురాలు తన జీవితంలో మదురైన ఘట్టాన్ని రద్దు చేసుకుంది. కరోనా కాలంలో పెళ్లి రద్దు చేసుకుంది. పెళ్లి వాయిదాకు వరుడి కుటుంబ సభ్యులు అంగీకరించక పోవడంతో మహిళా డాక్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర నాగ్పూర్లోని సెంట్రల్ ఇండియా కార్డియాలజీ ఆస్పత్రిలో అపూర్వ మంగళగిరి వైద్యురాలిగా పనిచేస్తున్నారు. అపూర్వ వివాహం ఏప్రిల్ 26 జరగాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో అపూర్వ కుటుంబ సభ్యులు పెళ్లి జరపడానికి సిద్దంగా లేరు. దీంతో పెళ్లి వాయిదా వేసే ప్రపోజల్ను వరుడి కుటుంబం ముందు ఉంచారు. అయితే వరుడి కుటుంబం పెళ్లి తేదీని వాయిదా వేసేందుకు నిరాకరించింది. అయితే మహిళా వైద్యురాలు అపూర్వ మాత్రం కరోనా రోగులకు సేవ చేయడానికి నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో తన పెళ్లిని రద్దు చేసుకుంది.
అపూర్వ తండ్రి గతేడాది సెప్టెంబర్లో కరోనాతో మరణించాడు. ఆ తర్వాత కుటుంబంలో జరిగిన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అపూర్వకు బాగా తెలుసు. అందుకే కరోనా సెకండ్ వేవ్ సమయంలో కరోనా బాధితులకు అండగా ఉండాలని ఆమె నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా తనలోని సేవ భావాన్ని చాటుకుంది. దీనిపై అపూర్వ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో వైద్యులు, ఇతర సిబ్బంది కోరత ఉందని.. అందుకే వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అపూర్వ తెలిపారు. ఇక, అపూర్వ కష్ట సమయంలో ప్రజలకు సహాయం చేయాలని నిర్ణయం తీసుకోవడం గర్వంగా ఉందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.