ఏడాది కాలంగా వందల మందికి కోవిడ్ చికిత్స అందించిన ఆ యువ వైద్యుడు ఊపిరితిత్తులు దెబ్బతిన్నా కరోనాను జయించాడు. మధ్యప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ మెడికల్ కాలేజీలో డా.సత్యేంద్ర మిశ్రా(35) పల్మనాలజీ వైద్యుడిగా సేవలు అందిస్తున్నాడు. ఏడాది కాలంగా ఎందరికో కరోనా చికిత్స అందించిన ఇతను ఇటీవల కొవిడ్ బారిన పడ్డాడు. స్థానికంగా చికిత్స అందించినా పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో సహచరులు వేడుకోవడంతో ఆరాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎయిర్ అంబులెన్స్ లో సికింద్రబాద్ యశోదకు పంపారు. అప్పటికే సత్యేంద్ర ఊపిరితిత్తులు 80 శాతం దెబ్బతిన్నాయి. లంగ్స్ మార్పిడి తప్పదు అని భావించిన వైద్యులు ఆ మేరకు వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించారు. అయితే ఎక్మో మీదకు వెళ్లకుండానే డా. సత్యేంద్ర మిశ్రా ఆరోగ్యం మెరుగుపడింది. కరోనా బారిన పడగానే తమకు ఏమి జరుగుతుందో అని ఆందోళన చెందే వారికి సంత్యేంద్ర మిశ్రా ఓ ఉదాహరణగా నిలిస్తున్నారు. ధైర్యంగా ఉంటే ఈ వైరస్ ను జయించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.