దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నుంచి వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని పాఠశాలలకు మంగళవారం నుంచి జూన్ 9 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. గత షెడ్యూల్ ప్రకారం మే 11 నుంచి జూన్ 3 వరకు వేసవి సెలవులుగా నిర్ణయించారు. అయితే ఢిల్లీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సెలవులను ముందుకు తెచ్చినట్లు ఢిల్లీ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.