తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామానికి చెందిన కళ్యాణం వెంకన్నకు ఇద్దరు భార్యలు. వెంకన్నకు ఇద్దరు భార్యల పై అనుమానం పెంచుకున్నాడు. దీంతో భార్యలను వేధించడం మొదలు పెట్టాడు. ఏప్రిల్ 3న మొదటి భార్య ముక్కులు,చెవులు కత్తిరించాడు. కత్తితో పొడిచాడు. రెండో భార్య పై సలసల కాగే నూనె పోశాడు. ఈయన చేసే అరాచకాలను వీడియో కూడా తీయించుకున్నాడు. ఈ వీడియో వైరల్ గా మారడంతో వెంకన్న బండారం బయటపడింది. చాలా క్రూరంగా వెంకన్న ప్రవర్తించాడు. వెంకన్న రెండో భార్య ఫిర్యాదుతో అతని అరాచకం బయటపడింది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియో చూసిన వారు వెంకన్నను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.