ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రిటన్ ప్రధాని భారత పర్యటన రద్దు

international |  Suryaa Desk  | Published : Tue, Apr 20, 2021, 08:14 AM

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దైంది. భారత్ లో కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం, భారత ప్రభుత్వం సంయుక్త ప్రకటన వెలువరించాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే వారం బోరిస్ జాన్సన్ ఇండియాలో పర్యటించాల్సి ఉంది. కాగా ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ఆయన హాజరు కావాల్సి ఉండగా కరోనా కారణంగా నాటి పర్యటన వచ్చే వారానికి వాయిదా పడింది. తాజాగా మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పర్యటన రద్దు చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com