ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ లో అక్కడ కుక్కమాంసానికి గుడ్ బై

national |  Suryaa Desk  | Published : Mon, Jul 06, 2020, 05:24 PM

మన దేశంలో ఎక్కడా కుక్కల్ని తినరు. నాగాలాండ్ ప్రజలు మాత్రం చికెన్ తిన్నట్లుగా కుక్కల్ని తింటారు. వాళ్ల కోసం కుక్కల్ని విదేశాల నుంచి తెప్పిస్తున్నారు. దీంతో ఎప్పటి నుంచో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తినడానికి ఏమీ లేనట్లు కుక్కల్ని తినడమేంటని మండిపడ్డారు. ఎన్నో ధర్నాలు, నిరసనలూ చేశారు. అయినా పట్టించుకోని నాగాలాండ్ ప్రభుత్వం ఇప్పుడు మాత్రం కరోనా ఎఫెక్టుతో దారికొచ్చింది. ఇకపై నాగాలాండ్‌కి కుక్క మాంసం దిగుమతి, వ్యాపారం, అమ్మకం ఉండదని తెలిపింది. ఈ ఈశాన్య రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో దేశంలోని కుక్కలకు జంతు ప్రేమికులు స్వేచ్ఛ లభించినట్లే అంటున్నారు.ఒకరకంగా ఇది మన దేశంలో అన్ని రాష్ట్రాలకూ శుభవార్తే ఎందుకంటే ఎక్కడో చైనాలో ప్రజలు అడ్డమైన పురుగులు, ప్రాణుల్ని తినడం వల్ల... కరోనా పుట్టిందంటున్నారు కాబట్టి కుక్కల్ని తింటే కూడా... రకరకాల వ్యాధులు రావొచ్చు... ఇప్పుడు నాగా ప్రజలు వాటిని తినడం మానేస్తే... అలాంటి వైరస్‌లు వచ్చే అవకాశం తగ్గుతుంది. నాగాలాండ్‌లో ఓ వర్గం ప్రజలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. కుక్కల్ని తినడమనేది తరాలుగా సంప్రదాయబద్ధంగా వస్తోందనీ, తమ ఆచారాల్ని మంట కలిపే కుట్ర జరుగుతోందని అంటున్నారు.తాజాగా నాగాలాండ్‌లోని ఓ వెట్ మార్కెట్లో సంచుల్లో కుక్కల్ని తాళ్లతో కట్టి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాకు ఎక్కాయి. చైనాలో ఇలాంటి వెట్ మార్కెట్ వల్లే కరోనా పుట్టిందనే వాదన ఉంది. దాంతో నాగాలాండ్ కుక్కల మార్కెట్ ఫొటోలు చూసి ప్రజలు బాగా భయపడ్డారు. దాంతో నాగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అందుకే ప్రభుత్వం దిగివచ్చి ఈ నిర్ణయం తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com