జాతినుద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పండగలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. అందుకే నవంబరు ఆఖరు వరకు పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని పొడిగిస్తున్నాం. రూ. 90 కోట్ల అదనంగా కేటాయిస్తున్నాం. ఈ పథకం కింద 80 కోట్ల మంది ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తాం. ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల బియ్యం లేదా 5 కిలోల గోధుమలు, కుటుంబానికి నెలకు కిలో చొప్పున కందిపప్పు ఇస్తాం. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ విదానంతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.