ఏపీలో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా కరోనా నిర్దారణ పరీక్షలు పెంచుతోంది ప్రభుత్వం. అంతేకాదు, ఇతర రాష్ట్రాలనుంచి వచ్చేవారిపై ఆంక్షలు కొనసాగిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి సరిహద్దుల్లో థర్మల్ స్క్రీనింగ్ చేశాకే అనుమతిస్తామని డీజీపీ సవాంగ్ తెలిపారు. రాత్రిపూట అనుమతి వుండదని డీజీపీ తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారిని అనుమతించే విషయంలో ఆంక్షలు కొనసాగుతున్నాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు, ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వారు కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు. స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని పాస్ పొందాలని సూచించారు. పాస్ ఉన్న వారిని ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. రాష్ట్ర సరిహద్దులోని పోలీస్ చెక్పోస్టుల వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే అనుమతిస్తారన్నారు. పాస్లు ఉన్నప్పటికీ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతించేది లేదన్నారు.
రాత్రి వేళల్లో అత్యవసర, నిత్యావసర సర్వీసులకు అనుమతి ఉంటుందన్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని డీజీపీ కోరారు. ఏపీలో కరోనా టెస్టులు బాగా పెరిగాయి. ఇప్పటివరకూ మొత్తం శాంపిల్స్ 8,87,797రికవరీ అయి డిశ్చార్జ్ అయినవారు 5245. 13 జిల్లాల్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు కర్నూలులో 1955అనంతపురం 1571కృష్షా జిల్లా 1467గుంటూరు 1349తూర్పుగోదావరి 1129చిత్తూరు 1054పశ్చిమగోదావరి 995కడప 940 నెల్లూరు 608విశాఖపట్నం 542ప్రకాశం 370విజయనగరం 159శ్రీకాకుళం 63