దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి (జులై 8)న రైతు దినోత్సవంగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతీ ఏడాది వైఎస్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల కోసం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ చర్యలు చేపట్టారని పలువురు వైసీపీ నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేశారు.