ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లక్షలాది అయ్యప్ప అరవణ ప్రసాదం డబ్బాలను నాశనం చేయనున్న ట్రావెన్‌కోర్ బోర్డు

national |  Suryaa Desk  | Published : Sat, May 18, 2024, 10:29 PM

కేరళలోని శబరిగిరుల్లో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అయితే అయ్యప్ప అంటే ఎంత ఇష్టమో.. అయ్యప్ప స్వామి అరవణ ప్రసాదం కూడా చాలా ఫేమస్. ఈ అరవణ ప్రసాదం కోసం అయ్యప్ప భక్తులు ఎగబడిపోతూ ఉంటారు. ఇక శబరిమలకు ఎవరైనా వెళ్తున్నారంటే.. అరవణ ప్రసాదం తీసుకురమ్మని చెబుతూ ఉంటారు. అంత ఫేమస్ ఆ అరవణ ప్రసాదం. ఇక ఆ అరవణ ప్రసాదం టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు అలాంటి అరవణ ప్రసాదాన్ని.. శబరిమల ఆలయ దేవస్థానం బోర్డు నాశనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కేరళ హైకోర్టు ఆదేశాలతో ఈ చర్యలకు దిగింది.


దాదాపు 6.65 లక్షల అరవణ ప్రసాదం టిన్లను డిస్పోజ్ చేయాలని ఇప్పటికే కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆ అరవణ ప్రసాదంలో వాడే యాలకుల్లో మోతాదుకు మించి పెస్టిసైడ్స్ ఉన్నాయని తేలింది. దీంతో కేరళ హైకోర్టు ఈ తీర్పును ఇచ్చింది. ఇక ఆ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయకుండా.. వాటిని డిస్పోజ్ చేయాలని ఆదేశించింది.


అయితే కేరళ హైకోర్టు ఆదేశాలతో 6.5 లక్షల ప్రసాదం క్యాన్లను సైంటిఫిక్‌గా డిస్పోజ్ చేసేందుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ అరవణ ప్రసాదం మొత్తం విలువ 5.3 కోట్లు ఉండవచ్చని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ అరవణ ప్రసాదం టిన్లను డిస్పోజ్ చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.


ఆ ప్రసాదం క్యాన్ల షెల్ఫ్ లైఫ్ పూర్తైన నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో కూడా అవి భక్తులకు చేరకూడదని వెల్లడించింది. ఇక పవిత్రమైన అయ్యప్ప ప్రసాదం కావడంతో వాటిని నాశనం చేసే సమయంలో అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఈ ప్రక్రియలో హెల్త్ అండ్ సేఫ్టీ మెజర్స్ పాటించాలని కేరళ హైకోర్టు ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com