భారతీయులు అధికంగా లబ్దిపొందు తున్న హెచ్-1బీతోపాటు పలు వర్క్ వీసాలపై అమెరికా ఆంక్షలు విధించబో తోందంటూ ఊహాగానా లు వెలువడుతున్న నేపథ్యంలో అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హెచ్-1బీ, ఎల్-1, ఇతర తాత్కాలిక వర్క్ వీసాలపై ఆంక్షలకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సోమవారం లోగా సంతకం చేస్తానని ట్రంప్ తెలిపారు. ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉపాధి కల్పన కు తోడ్పాటు నందించడం, ఇమ్మిగ్రేషన్పై ఆంక్షలు విధించ డంలో భాగంగా ఈ మేరకు ఆంక్షలు విధించనున్నట్టు ఆయన తెలిపా రు. ఈ ఆంక్షలు అనేకమందికి సంతోషాన్ని కలిగిస్తాయి. చాలా తక్కువ గా సడలింపులు ఉంటాయి అని ఆయన పేర్కొన్నారు. కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో మినహాయింపులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ కాలం పెద్ద వ్యాపారాలు కొనసాగుతున్నాయి. అయితే మినహాయింపులు తక్కువ మొత్తంలో ఉంటాయి. ఆంక్షలు కఠినంగా ఉంటాయి. సుధీర్ఘకా లమే ఈ ఆంక్షలు ఉంటాయి. కోవిడ్ -19 మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో అమెరికా తీవ్ర నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోం దని ట్రంప్ వివరించారు.
ష్థడసిిి™బిె nొ్థచ ్్ఘŸష్థడ|్శ
హెచ్-1బీపాటు ఇతర వర్క్ వీసాలపై ఆంక్షలు విధించాలనే ట్రంప్ నిర్ణయం భారతీయులపై తీవ్ర మైన ప్రభావాన్ని చూపనుంది. అక్టోబర్ 1 నుంచి ఈ ఆంక్షలు ఆచరణలోకి వచ్చే అవకా శాలున్నాయి. అమె రికా ఒక ఏడాదిలో జారీ చేస్తున్న వీసాల్లో 70 శాతం అంటే దాదాపు 85 వేల వీసాలను భారతీయులే పొందుతున్నారు. ఇమ్మిగ్రేష న్ లాయర్లు చెబుతున్న ప్రకారం… ఇప్పటికే అమెరికా లో వివిధ వీసాలపై ఉంటున్నవారిపై ప్రభావం చూపకపోవచ్చు. ఏడాది చివరి వరకు ఆంక్షలు ఆచరణలో ఉండే అవకాశా లున్నాయని పేర్కొంటు న్నారు. ఆంక్షలు విధిస్తే పెద్ద మొత్తంలో భారతీయు లపైనే కాకుండా అమెరికా కంపెనీలపై కూడా ప్రభావం చూపిస్తాయని ఆయన వివరించారు.
ష్థడసిి చ్శ్™ ూి్లబ చోŒఉీ
అమెరికాకు చెందిన గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల హెచ్-1బీ వీసాల షేరు పెరుగుతోంది. ఆర్థిక సంవత్సరం 2019లో అమెరికాకు చెందిన టాప్ 10 కంపెనీల్లో ఏడు కంపెనీలే అత్యధిక హెచ్-1బీ వీసాలను తీసుకు న్నాయి. అయితే ఇదే సమయంలో 2016-19 మధ్య కాలంలో హెచ్-1బీ వీసాల్లో భారతీయ కంపెనీల షేరు ఏకంగా 51 శాతం నుంచి 24 శాతానికి పడిపోయిం దని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డేటా చెబుతోంది. యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాట స్టిక్స్ తాజా గణాంకాల ప్రకారం… అమెరికాలో కంప్యూటర్ సంబంధిత నిరుద్యోగం జనవరి 2020లో 3 శాతంగా ఉండగా మే నెలలో 2.5 శాతానికి క్షీణిం చింది. ఇదే సమయంలో కంప్యూటరేతర ఆధారిత రంగాల్లో నిరుద్యోగ రేటు 4.1 శాతం నుంచి 13.5 శాతానికి పెరిగింది. వర్క్ వీసాలపై ఆంక్షల ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని ఇమ్మిగ్రేషన్ చట్ట సంస్థ లాక్వెస్ట్ మేనేజింగ్ పార్టనర్ పూర్వీ చొటాని పేర్కొన్నారు.