ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 20, 2020, 04:49 PM

ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటింది. ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని ఘన విజయం సాధించారు. మొత్తం 175 ఓట్లకు గాను 173 ఓట్లు పోలయ్యాయి. గెలుపొందిన ఒక్కో అభ్యర్థికి 38 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు కేవలం 17 ఓట్లు మాత్రమే వచ్చాయి. నాలుగు ఓట్లు చెల్లుబాటు కాలేదు. అవన్నీ టీడీపీ సభ్యులవే కావడం ఆ పార్టీకి షాక్ అని చెప్పవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com