ఆదోని పట్టణంలోని ప్రభుత్వ మాతాశిశు ఆసుపత్రిలో ప్రసవాలు చేస్తారని గర్భిణులు ఆందోళన చెందవద్దని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి లత తెలిపారు. శుక్రవారం ఆసుపత్రిలోని మంచాలు, గదులను శానిటైజేషన్ చేశామన్నారు. కరోనా వైరస్ అనుమానిత ఉద్యోగులకు కర్నూలులో, నంద్యాలలో 17 మందికి కోవిడ్19 టెస్ట్లు చేయిస్తే 15 మందికి నెగటివ్, ఇద్దరికి పాజిటివ్ వచ్చాయన్నారు. 15 మందిని ఇళ్లకు పంపారని తెలిపారు. ఆసుపత్రిలో ప్రసవాలు చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఆందోళన చెందకుండా గర్భిణులు ఆసుపత్రికి రావచ్చని సూచించారు.