ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో 130 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3718కి చేరుకుంది. ఇప్పటి వరకు కరోనాతో 2353 మంది డిశ్చార్జు కాగా 73 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1290 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. నేడు కరోనాతో కృష్ణా,కర్నూల్ జిల్లాలలో ఒక్కొక్కరు మరణించారు.