ఏపీ కరోనా హెల్త్ బులెటిన్ విడుదలైంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 161 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3588కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో కోలుకొని 2323 మంది డిశ్చార్జయ్యారు. 73 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 1192 ఉన్నాయి. ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.