లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే ఛత్తీస్గఢ్, పంజాబ్, బెంగాల్ రాష్ట్రాల్లో లిక్కర్ హోమ్ డెలివరీ అవుతోంది. ఆ రాష్ట్రాల్లో ఆ విధానం విజయవంతం అవ్వడంతో మిగిలిన రాష్ట్రాలు కూడా ఆ విధానం అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. భారతదేశంలో మందుబాబులకు సరిపడినన్ని మద్యం షాపులు లేకపోవడం వల్ల హోమ్ డెలివరీయే కరెక్ట్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రాబోవు రెండు వారాల తర్వాత దాదాపు 7-8 రాష్ట్రాల్లో ఈ డోర్ డెలివరీ రాబోతున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ ఎప్పుడు ఈ సర్వీస్ ప్రారంభించాలా అని ఓ రూట్ మ్యూప్ రెడీ చేసుకుంటున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో రెడ్ జోన్ ప్రాంతాల్లో లిక్కర్ అమ్ముతుండటంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అలాగే ఢిల్లీలో లిక్కర్ పై కరోనా సెస్ పేరుతో 70 శాతం రేటు పెంచడంపైనా తీవ్ర విమర్శలొచ్చాయి. ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా లిక్కర్ డోర్ డెలివరీకి ఒప్పుకోమని కోరుతున్నాయి. మరి ఏం జరగనుందో తెలియాలంటే మరో రెండు వారాలు ఎదురుచూడాల్సిందే.