ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుప్త నిధులకోసం గుడిలో దొంగల నిర్వాకం..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 11, 2020, 11:54 AM

"అది 16వ శతాబ్దం. ఏపీపై దండెత్తిన విదేశీ రాజులు... ఇళ్లలోకి చొరబడి... డబ్బు, నగలను ఎత్తుకుపోతున్నారు. ఆ సమయంలో... ఓ ఊరి పెద్ద... సమావేశం ఏర్పాటు చేసి... "మనందరికీ దేవుడే దిక్కు. మన దగ్గరున్న డబ్బు, నగలు అన్నీ తీసి... దేవుడి గుడిలో గొయ్యి తవ్వి... అక్కడ పాతి పెడదాం. విదేశీ రాజులు వెళ్లిపోయాక... మళ్లీ తీసుకుందాం. ఎవరు ఏం దాస్తున్నారో లెక్క రాసుకోండి" అని చెప్పడంతో... అంతా అదే చేశారు. ఆలయంలో భారీ గొయ్యి తవ్వి... ధనరాసులు, నగలు, బంగారు విగ్రహాలు, వజ్రాలు అన్నీ దాచుకున్నారు. గొయ్యి పూడ్చేసి... పైన స్వామి వారి విగ్రహం పెట్టి... పైన పూలు చల్లారు. ఆ తర్వాత... విదేశీ రాజులొచ్చి... స్థానికులందర్నీ చంపేశారు. దాంతో... ఆ నిధి నిక్షేపాల విషయం రహస్యంగా ఉండిపోయింది. ఇప్పుడు మనం వెళ్లి... ఆ గుప్త నిధులను కొల్లగొడదాం" అన్నాడో దొంగ. సరే అన్నారు మిగతా దొంగలు.


ఇలాంటి ఓ అసత్య కథను నిజమని నమ్ముతూ... ఏపీ... కృష్ణా జిల్లాలోని... వీరులపాడు మండలం... తాటిగుమ్మి గ్రామంలో... దొంగలు పడ్డారు. మూడు శతాబ్దాల నాటి పురాతన ఆలయంలో... గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఆలయం దగ్గర ఏదో తేడాగా అనిపించడంతో వెళ్లి చూసిన స్థానికులకు... తవ్వకాలు జరిపినట్లు అర్థమైంది. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామాల వాళ్లు... "దొంగలొచ్చారంట... గుళ్లో తవ్వారంట" అని చెప్పుకుంటూ భయపడుతున్నారు.


స్థానికులు ఏమంటున్నారంటే... ఆ గోతులను చూస్తే... అవి ఒక్క రోజులో తవ్వినట్లు లేవనీ... ఓ వారం నుంచి రోజూ కొద్దికొద్దిగా తవ్వుతున్నట్లు అనిపిస్తోందని అంటున్నారు. పోలీసులు గనక ఈ విషయాన్ని లైట్ తీసుకుంటే... రేపు అదే దొంగల ముఠా... తమ ఇళ్లపై పడి దోపిడీ చేసే ప్రమాదం ఉందని అంటున్నారు. తమ ఊళ్లో పురాతన ఆలయాన్ని కాపాడాలనీ, తమకు దొంగల బెడద లేకుండా చెయ్యాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com