ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయసాయిరెడ్డిపై ఆరోపణలు గుప్పించిన వర్ల రామయ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 11, 2020, 11:57 AM

విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజ్ ఘటన నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పరస్పర విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ విస్తరణకు టీడీపీ హయాంలో చంద్రబాబు అనుమతులిచ్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా, టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. ‘విజయసాయి రెడ్డి గారు! ఎల్జీ పాలిమర్స్ మీ ట్రస్టులో పెద్ద మొత్తం జమ చేసినట్లుగా అందరు అంటున్నారు. నిజమేనా? ఎంత జమ చేసినారు?’ అని ప్రశ్నించారు. మీ ట్రస్ట్ లో జమ చేసిన తర్వాతే ఆ కంపెనీకి అనుమతి ఇచ్చారా? అందుకేనా, మీరు విశాఖకు దూరంగా ఉంటున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వాస్తవాలన్నింటినీ పత్రికాముఖంగా  విశాఖ వాసులకు తెలియజేయండి అంటూ ఓ ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com