కరోనా సోకి పద్మశ్రీ అవార్డు గ్రహీత, స్వర్ణ దేవాలయ మాజా హజారీ రాగి నిర్మల్ సింగ్ ఖల్సా గురువారం ఉదయం మరణించారు. కరోనా సోకి చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. 62 ఏళ్ల ఖల్సా 2009లో పద్మశ్రీ పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన సింగ్.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో మార్చి 30న గురునానక్ దేవ్ ఆసుపత్రిలో చేరారు.