ఇంటింటికి రేషన్ పై విమర్శలు చేసే సమయం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. చేసింది చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు అని అన్నారు. ప్రచారం చేసుకునే విషయంలో మేం అలసత్వం వహించి ఉండొచ్చు అని అన్నారు. టెస్టుల విషయంలో మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీ ముందుంది. అవసరమైతే టీడీపీ వాళ్ళకూ టెస్టులు చేస్తాం అని అన్నారు. హైదరాబాద్ లో కూర్చొని విమర్శలు చేయడం సరికాదు. ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా ఇప్పటికే చర్యలు తీసుకున్నాం అని అన్నారు.