కేంద్ర ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ సీజీహెచ్ఎస్ లబ్దిదారులకు శుభవార్త వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు 21 రోజులపాటు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం లబ్దిదారులకు మూడు నెలలకు సరిపడా ఔషధాలను అందించాలని నిర్ణయించింది. దీర్ఘకాల వ్యాధులున్న రోగులకు నెలవారీగా వెల్ నెస్ సెంటర్ల ద్వార అందిస్తున్న మందులను మూడునెలలకు సరిపడా ఒకేసారి అందించాలని కేంద్ర సర్కారు ఆరోగ్యశాఖను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన కేంద్ర మాజీ ఉద్యోగులు సీజీహెచ్ఎస్ వెల్ నెస్ కేంద్రాలను సంప్రదించి మూడు నెలలకు కావాల్సిన మందులను పొందవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.