మరో ఐదు నెలల్లో జరగనున్న ఒలింపిక్స్కు ‘నినాదాన్ని’ క్రీడల నిర్వాహకులు సోమవారం ప్రకటించారు. ‘భావోద్వేగ ఐక్యత’ అని దానికి పేరు పెట్టారు. ‘సార్వత్రిక విలువలు, సంఘటిత శక్తి’ అన్న భావనలు ఈ నినాదంలో ప్రస్పుటిస్తాయని వారు పేర్కొన్నారు. ‘ఈ క్రీడలకు ముందు ప్రేక్షకులు ఒకరికొకరు తెలియరు. కానీ ఒలింపిక్స్ సందర్భంగా వారు ఒక్కటవుతారు. తమను విడదీసేకన్నా ఐక్యం చేసే శక్తి ఒకటి ఉందని గ్రహిస్తారు’ అని నినాదాన్ని ఆవిష్కరించిన సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు.