దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ మొదలైంది. ల్లీ అసెంబ్లీకి 70 స్థానాలు ఉన్నాయి. 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని అధికారం చేపట్టింది. ఈ సారి కూడా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్కే ప్రజలు పట్టం కడతారని సర్వే సంస్థలు అంచనా వేశాయి.గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ హవా కనిపించింది. ఏడు లోక్సభ స్థానాలు గెలిచి సత్తా చాటింది. కానీ ఏడాదిలోపే పరిస్థితి మారిపోయినట్టు అనిపించింది. ఢిల్లీ ప్రజల గాలి మళ్లీ చీపురు పార్టీకే మళ్లినట్టు కనిపిస్తోంది. శనివారం సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. క్యూ లైన్లో ఉన్నవారికి ఓటేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. ఈ నెల 11 మంగళవారం రోజున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. మధ్యాహ్నం వరకు ట్రెండ్ తెలిసిపోతోంది. ఢిల్లీని ఏలే రాజు ఎవరో తేలిపోతోంది.