ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను వైసీపీ ఎమ్మెల్యే రోజా కలిశారు. తాజా పరిస్థితులపై ఆమె డీజీపీతో చర్చించినట్టు తెలుస్తోంది. కాగా, ఏపీలో మారిన పరిణామాల నేపథ్యంలో రోజాకు మంత్రిపదవి ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. మండలి రద్దు నేపథ్యంలో, మండలి నుంచి మంత్రిగా పదవులు దక్కించుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల రాజీనామా అనివార్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, రోజా క్యాబినెట్ లో ప్రవేశించడం తథ్యమంటూ ప్రచారం జరుగుతోంది.