కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే ముందు రైతుల్లో రసాయన ఎరువుల వినియోగం తగ్గింపుపై అవగాహన కలిగించాల్సి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ వ్యవసాయ అధికారుల సిఫార్సులకు లోబడే వీటిని వినియోగించాల్సి ఉందని, అధికంగా వాడకూడదని చెప్పారు. రైతులు సేంద్రియ వ్యవసాయానికి మళ్లే ముందు ఈ లోపాన్ని సవరించాల్సి ఉందని తెలిపారు. ఈ దిశగా ప్రభుత్వం ప్రచారం చేపడుతుందని చెప్పారు. దేశంలో సేంద్రియ ఉత్పత్తులు, సంప్రదాయ వ్యవసాయంపై ఆసక్తి పెరుగుతోందని అన్నారు. రసాయన ఎరువులపై ఇచ్చే రాయితీలను ఆమె బడ్జెట్లో 10 శాతం మేర తగ్గించడం గమనార్హం.