ఫిబ్రవరి 1నుంచి 54లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జగన్ మాట్లాడుతూ… ఇళ్ల పట్టాల మంజూరులో అన్యాయం జరిగిందన్న మాట రాకూడదన్నారు. ఫిబ్రవరి 28న విద్యా వసతి దీవెన ప్రారంభమవుతుందన్నారు.