ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సీఎం పెద్దపీట వేస్తున్నారని మంత్రి అనిల్కుమార్ తెలిపారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన సాగుతోందన్నారు. తాము ఓకే చెబితే చాలా మంది టీడీపీ నేతలు, పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీని వీడబోతున్నారని వెల్లడించారు. నెల్లూరు జిల్లా నుంచి త్వరలో మరిన్ని చేరికలుంటాయన్నారు. త్వరలో టీడీపీ భూస్థాపితం అవుతోందని జోస్యం చెప్పారు. జగన్ సీఎం అయ్యాక ఎలాంటి మాఫియాకు అవకాశం లేదని, నెల్లూరులో ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలపై ఆయన్నే వివరణ అడగాలని అనిల్ చెప్పారు.