ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలను పక్కదోవ పట్టించేందుకే బూతులు మాట్లాడుతున్నారు :దేవినేని ఉమా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 29, 2019, 02:48 PM

వైసీపీ పాలన పక్కదోవ పట్టిందని... ఆ వైఫల్యాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించేందుకే వైసీపీ మంత్రులు బూతులు మాట్లాడుతున్నారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. జగన్ అభద్రతాభావంలో ఉన్నారని చెెప్పారు. పార్లమెంటులో తమ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడేటప్పుడు కూడా వైసీపీ ఎంపీలు అడ్డు తగులుతున్నారని విమర్శించారు. వైసీపీ పార్లమెంటు సభ్యులు ఎంతగా దిగజారిపోయారో దీన్ని బట్టి అర్థమవుతోందని అన్నారు.


జగన్ కు ఇంత అసహనం ఎందుకని దేవినేని ప్రశ్నించారు. చంద్రబాబును బూతులు తిడితే మంచి పేరు వస్తుందని వైసీపీ మంత్రులు అనుకుంటున్నారని విమర్శించారు. వీరీ మాటలను జనాలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. చివరకు రాళ్లు వేసే విష సంస్కృతికి కూడా తెరలేపారని అన్నారు. చంద్రబాబును తిట్టిస్తూ జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com