మానసిక సమస్యతో జీవితం మీద విరక్తితో అనేక సార్లు ఆత్మహత్యకు పాల్పడ్డ ఓ యువతిలో ఉన్నట్టుండి మార్పు వచ్చింది. ఆ మార్పు ఎలా వచ్చిందంటే... సూపర్స్టార్ రజనీకాంత్ వల్ల. అలా ఎలా అనుకుంటున్నారా...?... వివరాల్లోకెళితే.. చెన్నైకు చెందిన అనీషా అనే బాలిక బైపోలార్ డిజార్డర్, డిప్రెషన్తో బాధపడుతోంది. ఎన్నో సార్లు ఆత్మహత్య చేసుకోవాలని చూసింది. బిడ్డ బాధను చూడలేక ఆమె తల్లి లక్షలు ఖర్చు పెట్టింది. అయినా ఫలితం లేకుండా పోయింది. కానీ ఎప్పుడైతే అనీషా రజనీకాంత్ను కలిసిందో తన బాధలన్నీ పోయాయి. అనీషా తలైవాకి వీరాభిమాని. అయితే రజనీకాంత్ను కలవాలన్న ఉద్దేశంతో అనీషా ఈ అఘాయిత్యాలకు పాల్పడలేదు. వైద్యుల వద్దకు తీసుకెళ్లినా కూడా అనీషా ఆరోగ్యం బాగుపడకపోవడంతో ఎందుకైనా మంచిదని ఆమెను రజనీ వద్దకు తీసుకెళ్లింది అనీషా తల్లి. జరిగినదంతా రజనీకాంత్కు చెప్పింది. ఆ తర్వాత రజనీ అనీషాతో కాసేపు మాట్లాడాడు. అప్పుడు అనీషా కాస్త కోలుకుంది. ఈ విషయాన్ని అనీషా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘నాకు డిప్రెసివ్ డిజార్డర్, బైపోలార్ డిజార్డర్ సమస్యలు ఉన్నాయి. దాదాపు నలుగురు డాక్టర్స్ నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ నాలో ఎలాంటి మార్పు రాలేదు. రోజూ రాత్రిళ్లు ట్యాబ్లెట్స్ వేసుకుని పడుకునేదాన్ని. రోజూ సైకాలజిస్ట్ల వద్ద కౌన్సిలింగ్ తీసుకునేదాన్ని. నా జీవితం నాశనమైపోతున్నట్లు అనిపించేది. దాంతో నేను నాడి కోసుకున్నాను. కానీ బతికాను. చనిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఎన్నో యాంటీ డిప్రెసెంట్ ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. ఆ తర్వాత నా కడుపు క్లీన్ చేసి నన్ను బతికించారు. నాలో మాత్రం మార్పులేదు. ట్రీట్మెంట్ కోసం చెన్నై నుంచి కేరళ అక్కడి నుంచి బెంగళూరుకు తీసుకెళ్లారు’. ‘ఒక్కసారిగా నేను అన్ని రకాల ట్రీట్మెంట్స్కు అలవాటు పడిపోయాను. దాంతో ఏదీ వర్కవుట్ అయ్యేది కాదు. ఈరోజు నన్ను అమ్మ రజనీకాంత్ వద్దకు తీసుకువెళ్లింది. ఎప్పుడైతే నేను ఆయన్ను కలిశానో నాకు బతకాలన్న ఆశ కలిగింది. నేను మనుషులతో ఎప్పటికీ కలవలేను అని డాక్టర్స్ అన్నారు. కానీ నేను కలవగలను. రజనీ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటికీ ఆయనకు రుణ పడి ఉంటాను’ అని పేర్కొంది. ఈ పోస్ట్ చూసి ఎందరో నెటిజన్ల గుండెలు బరువెక్కాయి. ఎందరో వైద్యులు చేయలేనిది తలైవా చేసి చూపించాడంటూ ఆయన్ను ఆకాశానికెత్తేస్తున్నారు.