ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెహ్రూ జయంతి సందర్భంగా ప్రముఖుల నివాళి

national |  Suryaa Desk  | Published : Thu, Nov 14, 2019, 10:30 AM

భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. ‘‘మన మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులు...’’ అని ప్రధాని మోదీ గురువారం ట్వీట్ చేశారు. 1889 నవంబర్ 14న ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నెహ్రూ జన్మించారు. 1964 మార్చి 27న ఆయన తుదిశ్వాస విడిచారు. స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన నెహ్రూ... 1947 ఆగస్టు 15న భారత తొలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. స్వతంత్ర భారత తొలి ప్రధాని నెహ్రూ గౌరవార్థం ప్రతి ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటారు. చిన్నపిల్లలపై ఉన్న ప్రేమ, అనురాగాల కారణంగా ఆయనను ముద్దుగా చాచా నెహ్రూ అని పిలుస్తారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com