ఢిల్లీలోని ఓ రెస్టారెంట్లో దారుణం జరిగింది. ఓ టేబుల్పై డిన్నర్ చేస్తున్న భార్యాభర్తలపై ఆరుగురు వ్యక్తులు దాడి చేశారు. మొదటి అతని భార్యను వేధించిన ఆ వ్యక్తులు.. వారిని ప్రశ్నించినందుకు అతనిపై కూడా దాడికి పాల్పడ్డారు. మద్యం సీసాతో అతని తలపై బలంగా కొట్టారు. దీంతో అతను తీవ్ర గాయాలపాలయ్యాడు. ఢిల్లీలోని సెక్టార్ 47 సోహ్న రోడ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వారిపై దాడి చేసిన ఆరుగురు వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నట్టు గుర్తించారు. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని తెలిపారు.