జనసేన అధినేత పవన్ కల్యాణ్తో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే పవన్ కల్యాణ్ను ఆయన నివాసంలో టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య సమావేశమయ్యారు. రేపు ఇసుక కొరతపై విజయవాడలో ధర్నా చౌక్ వద్ద చంద్రబాబు చేస్తున్న ఇసుక దీక్షకు మద్దతివ్వాలని కోరారు. దీనిపై పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించారు. తమ పార్టీ తరపున మద్దతిస్తామని పేర్కొన్నారు. ఈ భేటీ అనంతరం మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ టీడీపీ చేపట్టిన ఇసుక దీక్షకు మద్దత్తు ఇవ్వాలని పవన్ను కోరామన్నారు. ఇసుక కొరతకి సంబందించి ఎవరు నిరసన తెలిపిన మద్దతిస్తామని పవన్ తెలిపారన్నారు. ప్రభుత్వ తప్పుల్ని గుర్తు చేస్తే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. నిన్న పవన్ ప్రెస్ మీట్ పెడితే వెంటనే ఒక మంత్రి ఒంటికాలు మీద వచ్చాడంటూ మండిపడ్డారు.
మాకు నోరు ఉంది మేము మాట్లాడగలము.కానీ సమస్య పరిష్కారం కావటం మాకు ముఖ్యమన్నారు అచ్చెంనాయుడు పవన్ తో సుదీర్ఘ చర్చ జరిపామన... పార్టీ తరపున మద్దతిస్తామని పవన్ తెలిపారని అచ్చెంనాయుడు చెప్పుకొచ్చారు. అన్ని పార్టీలు చంద్రబాబు దీక్షకు మద్దతిచ్చాయని... రేపు ఎవరెవరు దీక్షలో పాల్గొంటారో చూడాలన్నారు అచ్చెంనాయుడు.