జెఎన్యు విద్యార్థుల ధర్నా కొనసాగుతోంది. ఫీజులు, మెస్ డిపాజిట్ మొదలైన తగ్గించాలనే పలు డిమాండ్లతో వారు ధర్నా చేస్తున్నారు. విద్యార్థులకు సింగిల్ రూమ్ అద్దెను 10 రూపాయిలనుంచి 300 రూపాయిలకు పెంచారు. డబుల్ రూమ్ అద్దెను 20 రూపాయిలనుంచి 600 రూపాయిలకు పెంచారు. మెస్ సెక్యూరిటీ డిపాజిట్ను 5500 రూపాయిలనుంచి 12 వేల రూపాయిలకు పెంచారు. ఈ డిపాజిట్ను తిరిగి ఇచ్చేస్తారు.