కాకినాడ: తూర్పుగోదావరి జిల్లో ఇసుక రీచ్ లను తెరిపించాలని కోరుతూ సీఐటీయూ నాయకులు నిరసన దీక్షకు దిగారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఇసుక రీచ్ లను వెంటనే తెరిపించాలని, మృతిచెందిన కార్మికులకు రూ 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ నేతలు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. సిఐటియు రాష్ట్ర నాయకులు దువ్వా శేషు బాబ్జి ,బేబీ రాణి ఈ శిబిరాన్ని ప్రారంభించారు.