న్యూఢిల్లీ: ఓ జంట డిన్నర్ చేసే నిమిత్తం రెస్టారెంట్కు వెళ్లింది. కాగా ఆరుగురు వ్యక్తులతో కూడిన గుంపు రెస్టారెంట్లో దంపతులను టార్గెట్ చేశారు. భార్యను దుర్భాషలాడుతుండగా అడ్డుకునే యత్నం చేసిన భర్త తలపై మందు సీసాతో దాడి చేశారు. ఈ ఘటన ఢిల్లీకి నైరుతిగా ఉన్న గుర్గావ్లో గడిచిన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ గొడవ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మందుబాబులు ఆరుగురు డిన్నర్ ఆరగిస్తున్న ఫ్యామిలీ టేబుల్ను చుట్టుముట్టారు. వారితో వాగ్వాదానికి దిగి దాడి చేశారు. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా చెప్పారు.