చంద్రబాబు నుంచి సరైన సహకారం లేదనే భావనలో ఉన్న తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ పార్టీ మారితేనే మంచిది అని భావిస్తున్నారట. మరో రెండు రోజుల్లో పార్టీ మారే అవకాశం ఉందని వినవస్తోంది. ఆయన గత కొంత కాలంగా పార్టీ అధిష్టానం తీరుపై ఆగ్రహంగా ఉన్నారని, అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి.
గతంలో అవినాష్ పార్టీ మార్పుపై వార్తలు వచ్చినా వాటిని ఖండిస్తూ వచ్చిన ఆయన రాజకీయంగా తన కుటుంబం చాలా బలమైనదే అయినా పార్టీ పరంగా ప్రొత్సాహం మాత్రం లభించడం లేదని, తనను గుడివాడ పంపించడం ఇష్టం లేని అవినాష్, అక్కడే పని చెయ్యాలని అధిష్టానం సూచించడంపైనా అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.
అలాగే వచ్చే ఎన్నికల నాటికి పెనమలూరు సీటు ఇస్తామని చెప్పి ఇప్పుడు వంశీ రాజీనామా చేసే పక్షంలో ఖాళీ అయ్యే గన్నవరం స్థానం నుంచి పోటీ కి దిగాల్సి ఉంటుందని అధిష్టానం పదే పదే చెప్పడం, దీనిపై లోకేష్ ఒత్తిడి చేయడం అవినాష్ ఇబ్బంది పడుతున్నారని భోగట్టా. ఈ క్రమంలోనే ఇక పార్టీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నారని , మరో రెండు రోజుల్లో ఆయన జగన్ సమక్షంలో వైసిపిలో చేరే అవకాశాలున్నట్టు తెలియవచ్చింది.
అయితే నిన్నటివరకు పార్టీ నేతల బుజ్జగింపులకు లోనైన అవినాష్, ఇప్పుడు హఠాత్తుగాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, సన్నిహితులకు కూడా దూరంగా వెళ్లిపోవటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.