విజయవాడ: రేపు నిర్వహించతలపెట్టిన చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలపాలని జనసేనాని పవన్ను కోరామని టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. జనసేనానితో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. జగన్ పాలన వల్ల రాష్ట్ర పరువు రోడ్డున పడిందన్నారు. ప్రభుత్వం ఎదురు దాడి మానుకోవాలన్నారు. ఇసుక, కార్మికుల ఆత్మహత్యలపై అన్ని పార్టీలు కలిసి రావాలన్నారు. పవన్తో అన్ని విషయాలు చర్చించామని, పార్టీ తరపున మద్దతు ఇస్తామని పవన్ చెప్పారన్నారు.