మీరు బిఎస్ ఎన్ ఎల్ ల్యాండ్లైన్, బ్రాడ్బ్యాండ్ వినియోగదారులా అయితే ఈ ఆఫర్ మీకోసమే... శుక్రవారం రాత్రి ఈ ఖాతాదారులకు పరిమిత కాలం పాటు అపరిమిత వాయిస్ కాల్స్ ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ ఓ ప్రకటన విడుదల చేస్తూ, దీపావళి పండుగ సందర్భంగా దేశంలో ఏ ల్యాండ్లైన్, మొబైల్ నంబరుకైనా ఉచితంగా, అపరిమితంగా కాల్స్ చేసుకునే వీలు కలిపిస్తున్నట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న తమ మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పేందుకు వీలుగా ఈ ఆఫర్ను వినియోగదారులకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ ఆఫర్ ఆదివారం (27వ తేదీ)-సోమవారం (28) మధ్య 24 గంటలపాటు అందుబాటులో ఉంటుందని వివరించారు.