దీర్ఘకాలిక జబ్బులకు ఆయుర్వేద వైద్యం మంచి ఫలితాలు ఇస్తుందని శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు అన్నారు.అక్టోబరు 25 వ తేది జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా(ఆయుర్వేద పీత మహుడు ధన్వంతరి జయంతి)స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆయుర్వేద విభాగం నందు ధన్వంతరి జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యం వాడుతున్న వారి సంఖ్య పెరుగుతోందిని అన్నారు.ఆయుర్వేద డాక్టర్లు మరియు సిబ్బంది కూడా అందుబాటులో ఉండటం వలన మరింత సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు.ఆయుర్వేదం వైద్యం వలన దీర్ఘకాలిక జబ్బులు పూర్తిగా తగ్గు తాయని చికిత్సపొందుతున్న వారికి నమ్మకం కలుగుతుందని అన్నారు.వ్యాధి గ్రస్తులు ఇటువంటి ఆవాకాశాలను ఉచితంగా పొంది మంచి ఆరోగ్య వంతులు కావాలని అన్నారు.కార్యక్రమంలో హాస్పిటల్ సుపెరిడెంట్ డాక్టర్ టి.రమేష్ కిషోర్,డాక్టర్ కె.విజయ కుమారి,మాజీ కార్పొరేటర్ బొంత శ్రీ హరి,సోమ సుందరం తదితరులు పాల్గొన్నారు.