మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ బీజేపీలో చేరాలని ఎందుకు ప్రయత్నించారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబు గవర్నరుకు ఫిర్యాదు చేయడంపై స్పందించిన బొత్స.. గతంలో గవర్నర్ వ్యవస్థపై నమ్మకమే లేదన్న బాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని గవర్నర్ వద్దకు వెళ్లారన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటిరోజే చంద్రబాబు చట్టాలను తుంగలో తొక్కారని, రాష్ట్రంలోకి సిబిఐని రావద్దన్న చంద్రబాబు ఇప్పుడు సిబిఐ దర్యాఫు కావాలంటున్నారన్నారు. గత మూడు నెలలలో చంద్రబాబు కోడెలను ఎన్నిసార్లు కలిశారని, కోడెల సొంతపార్టీలో గౌరవం దక్కక బీజేపీలో చేరాలని అనుకోలేదా? అని ప్రశ్నించారు.