ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 21 నుండి 27 వరకు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. హ్యూస్టన్, న్యూయార్క్ నగరాలలో పర్యటించనున్న ప్రధాని ముందుగా 21న హ్యూస్టన్లో రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొని అనంతరం అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయులతో సమావేశం కానున్నారు. ట్రంప్ డెమొక్రటిక్ పార్టీ నేతలతో కలిసి ప్రసంగించనున్న ప్రధాని ఐరాస నిర్వహిస్తున్న వాతావరణ సదస్సులో కూడా ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో ఆరోగ్యం, ఉగ్రవాదంపైన మోడీ మాట్లాడనుండగా ఈనెల 24న ఐరాసా సెక్రెటరీ జనరల్ ఇచ్చే విందుకు హాజరుకానున్నారు. అదే ఐక్యరాజ్యసమితి సభ్యులతో కలిసి గాంధీ 150 జన్మదినం సందర్భంగా 150 మొక్కలను నాటనున్నారు. పారిశ్రామికవేత్తలు, ప్రతినిధి బృందాలతో చర్చలు జరుపనున్న ప్రధాని ఐరాస సాధారణ సమావేశాలలోను ప్రసంగించనున్నారు.