ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తాం : మంత్రి కృష్ణదాస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2019, 04:26 PM

రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర క్రీడలు, యువజనసర్వీసులు, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌రావు తెలిపారు. శుక్రవారం రోడ్డు, భవనాలశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీకూర్మం, అరసవల్లి, శ్రీముఖలింగంతో కలిపి మూడు ప్రముఖ దేవాలయాలు ఉన్నాయని అన్నారు. వాటిని అభివృద్దిపర్చడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. సూర్యదేవాలయం కేవలం శ్రీకాకుళంలోనే ఉందన్నారు ఈ దేవాలయ విశిష్టతను తెలియజేయవలసిన ఆవశ్యకత ఉన్నదన్నారు. సాలిహుండం, బారువ బీచ్‌ను అరకు, బొర్రా గుహలతో సమానంగా అభివృద్ధి పరచనున్నామని తెలిపారు దేవాలయాలతోపాటు పర్యాటకంగానూ జిల్లాను అభివృద్ధి చేస్తామని, ఉత్తరాంధ్రను పర్యాటకంగా అభివృద్ధి పరచి రాష్ట్రంలోనే ప్రధమస్థానంలో నిలుపుతామని తెలిపారు అంతర్జాతీయ క్రీడాకారులు జిల్లాలో ఉన్నారని అంటూ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్టేడియంలను పూర్తిచేస్తామన్నారు.ఈసందర్భంగా రోడ్డు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలు, టూరిజం అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు జిల్లాలోని పురాతన దేవాలయాలను సైతం పునరుద్దరిస్తామన్నారు. అంతకు ముందు దేవాలయాల ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతంపలికారు. మంత్రులు స్వామి దర్శనం చేసుకోగా అర్చకులు ఆశీర్వచనాలు అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com