భారీ వర్షాలకు మధ్య ప్రదేశ్ లో వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ప్రధాన వాగులన్నీ వరద నీటితో ఉగ్రరూపం దాల్చాయి. పలు ప్రాంతాలలో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాజ్ ఘర్ జిల్లాలో నెవాజ్ నది ప్రమాాద స్థితిని దాటి ప్రవహిస్తున్నది. ఈ నది వరద కారణంగా పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.