అమెరికా : కాశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం చేయబోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసినట్లు అమెరికాలో భారతీయ దౌత్యాధికారి హర్షవర్థన్ ష్రింగ్లా తెలిపారు. భారత్, పాక్ లు అంగీకరిస్తే కాశ్మీర్ అంశం పై మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ చెప్పడంతో, ఇండియా దానిని ఆహ్వానించలేదని, అందుకే ట్రంప్ ఆ అంశాన్ని వదిలేశారని తెలిపారు. ద్వైపాక్షిక అంశాల్లో ఇతరుల జోక్యం ఉండబోదని హర్షవర్థన్ పేర్కొన్నారు.