ట్రెండింగ్
Epaper    English    தமிழ்

20న విజయనగరం జిల్లాలో కాలుష్య నియంత్రణ మండలి కమిటీ పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 07, 2019, 11:14 PM

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఘన వ్యర్ధాల నియంత్రణ పై జస్టిస్ బి.శేషశయన రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన  రాష్ట్ర స్థాయి కమిటీ ఆగష్టు 20వ తేదీన విజయనగరం జిల్లాలో పర్యటించనుందని కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ టి.సుదర్శనం తెలిపారు. బుధవారం ఆయన ఓ ప్రకటన విధుల చేస్తూ ఈ కమిటీ  ఘన వ్యర్ధాల నిర్వహణలో 2016 కాలుష్య నియంత్రణ చట్టంలో పొందుపరచిన నిబంధనల మేరకు వివిధ పురపాలక సంస్థలు, ఇతర సంస్థలు పర్యావరణ ప్రమాణాలు పాటిస్తున్నదీ లేనిదీ పరిశీలించి, అధికారులతో సమీక్షిస్తుందని,  పట్టణ స్థానిక సంస్థలు, ఆదర్శ గ్రామాల్లో ఘన వ్యర్ధాల నిర్వహణకు పాటిస్తున్న విధానాలపై వైద్య ఆరోగ్య అధికారులతో, మునిసిపల్ అధికారులతో సమీక్షించనున్నారు. జీవ ఔషధ వ్యర్ధాల నిర్వహణ, ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ, భవన నిర్మాణ వ్యర్ధాలు, కూల్చిన కట్టడాలకు సంబంధించిన వ్యర్ధాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షిస్తారు. రాష్ట్ర కమిటీ పర్యటన నేపథ్యంలో జిల్లా స్థాయిలో కలెక్టర్ డా హరి జవహర్ లాల్ ఆధ్వర్యంలో ఈ నెల 13 న అధికారులతో చర్చిననున్నట్టు  టి.సుదర్శనం తెలిపారు.




 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com