ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులైన నిరుపేద లబ్దిదారులకు అందించేందుకు, వార్డు వాలంటీర్లు సేవా దృక్పథంతో కృషి చేయాలని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి బొత్సా సత్యనారాయణ చెప్పారు. విజయవాడలోని స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం వార్డు వాలంటీర్లుగా ఎంపికైన అభ్యర్దుల శిక్షణా తరగతులకు మంత్రి ముఖ్యఅతిధిగా పాల్గోని మాట్లాడుతూ వై.యస్.జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ప్రజల పెన్షన్, రేషన్ కార్డులు వంటి చిన్న చిన్న వాటికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారో పరిశీలించి, దళారీ వ్యవస్థ లేని సుపరిపాలన అందించేందుకు నూతన గ్రామ, వార్డు వాలంటరీర్లతో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు ఆలోచన చేశారన్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభానికి శ్రీకారం చుట్టారని గ్రామ, వార్డు వాలంటీర్లు సేవాభావంతో పనిచేసి ముఖ్యమంత్రి ఆశయసాధనలో భాగస్వాములు కావాలన్నారు.