ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవంబర్‌ 1 నుంచి పోలవరం పునర్నిర్మాణం: అనిల్‌కుమార్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 03, 2019, 03:18 PM

పోలవరం పునర్నిర్మాణాన్ని నవంబర్‌ 1 నుంచి ప్రారంభిస్తామని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. నెల్లూరులో ఆయన ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలవరంలో దోపిడీ నిర్మూలనకు రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తున్నామన్నారు. ప్రభుత్వ చర్యలతో పోలవరం ఆలస్యమవుతుందనడంలో అర్థం లేదన్నారు. సెప్టెంబర్‌ వరకు పోలవరంలో ఎలాంటి పనులు జరగవన్నారు. సెప్టెంబర్‌ కల్లా అన్ని పనులు పూర్తి చేసి కొత్త కాంట్రాక్టర్‌తో పనులు చేయిస్తామన్నారు. పారదర్శకంగా పనులు చేపట్టి 2021 ఆఖరుకల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com